ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణ: ఖతార్ దాడులు, ట్రంప్ ప్రకటన, భారతీయుల తరలింపు – తాజా పరిణామాల సమగ్ర విశ్లేషణ
ట్రంప్ ట్వీట్ కలకలం: “యుద్ధం ముగిసింది” – కానీ ఇరాన్ ఖండన
యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 24 న తెల్లవారుఝామున ట్వీట్ చేసి “ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది” అని ప్రకటించారు. అయితే, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘచీ వెంటనే స్పందిస్తూ, “ఏ కాల్పుల విరమణ ఒప్పందం జరగలేదు” అంటూ ఖండించారు. ట్రంప్ ప్రకటనకు మిలిటరీ స్థాయిలో ఎలాంటి ఆధారం లేకపోవడం గమనార్హం.
ఖతార్లోని అల్-ఉదీద్ ఎయిర్ బేస్పై ఇరాన్ దాడి
ఇరాన్ తన వైమానిక దాడులను విస్తృతం చేస్తూ, ఖతార్లో ఉన్న అల్-ఉదీద్ ఎయిర్బేస్ను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ బేస్పై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించబడ్డాయి. వాటిలో చాలా మిస్సైల్స్ ఖతార్ మరియు అమెరికా కౌంటర్ డిఫెన్స్ ద్వారా తిప్పి
కొట్టినప్పటికీ, ఈ దాడి తీవ్ర ఉద్రిక్తతకు సంకేతం.
ఖతార్, ఇరాక్, కువైట్లోని యుఎస్ స్థావరాలపై దాడులు
ఖతార్కు తోడు, ఇరాక్, కువైట్లలోని అమెరికా బేస్లపై కూడా ఇరాన్ మిస్సైల్ దాడులకు పాల్పడింది. ఇరాక్లోని స్థావరాలు ఇప్పటికే ఇరాన్ మద్దతు గల మిలీషియా ప్రభావంలో ఉండగా, కువైట్ దాడి వివరాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. ఈ దాడులపై అమెరికా సహా గల్ఫ్ దేశాలు తీవ్రంగా స్పందించాయి.
ఖతార్ గగనతలం తాత్కాలికంగా మూసివేత
ఇరాన్ దాడుల నేపథ్యంలో, ఖతార్ తాత్కాలికంగా తన గగనతలాన్ని మూసివేసింది. వాణిజ్య, మిలిటరీ విమానాల రాకపోకలపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. అంతర్జాతీయ విమానయాన సంస్థల సహకారంతో ఫ్లైట్ రీ రూటింగ్ చర్యలు చేపట్టబడ్డాయి.
ఖతార్లో భారతీయుల కోసం ఎంబసీ అలెర్ట్, విమానాలు రద్దు
ఖతార్లో ఉన్న భారతీయుల భద్రత దృష్ట్యా, భారత ఎంబసీ ఎమర్జెన్సీ హెల్ప్లైన్ అందుబాటులో ఉంచింది. వారిని ఇంట్లో ఉండమని, అత్యవసర సమయంలో మాత్రమే బయటికి రావాలని సూచించింది. ఖతార్ ఎయిర్స్పేస్ మూత పడడంతో, భారత్ నుండి ఖతార్కు విమానాలు రద్దయ్యాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల నుంచి భారతీయుల తరలింపు
భారత ప్రభుత్వం “ఆపరేషన్ సింధు” ప్రారంభించి, ఇరాన్ మరియు ఇజ్రాయెల్ నుండి భారతీయుల తరలింపు ప్రారంభించింది. విమాన సేవలు రద్దు కావడంతో, భూభాగ మార్గాల్లో తరలింపు చేపట్టబడ్డది. భారత్ ఎంబసీలు అవసరమైన ఆశ్రయం, రవాణా సదుపాయాలు కల్పిస్తున్నాయి.
ఖతార్ దాడులను ఖండించిన సౌదీ అరేబియా, ఖతార్ అధికారిక ప్రకటన
సౌదీ అరేబియా ఈ దాడులను ఖండిస్తూ, ఇరాన్ చర్యలను “ప్రాంతీయ శాంతిని భంగపరిచే చర్య”గా అభివర్ణించింది. ఖతార్ సైతం ఈ దాడిని ఖండిస్తూ, తమ గగనతలంలోకి వచ్చిన మిస్సైళ్లను తిప్పికొట్టినట్లు ప్రకటించింది.
